ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ఎన్ఆర్ఎస్సీ, వాతావరణ శాఖ విచారణ చేపట్టింది. అడవుల్లో వాతావరణ పరిస్థితులను ఎన్ఆర్ఎస్సీ నమోదు చేసుకుంది. 2018 జనవరి 22న మేడారంలోని చిలకల గుట్టలో టోర్నడోలాంటి సుడిగాలి బీభత్సం సృష్టించింది. మేడారంలో అడవుల్లో టోర్నడోలా బీభత్సం వల్లే అడవులు ధ్వంసమైనట్టు అధికారులు నిర్థారణకు వస్తున్నారు.