జగన్ వల్లే నాకు అప్పు ఇచ్చే వాళ్లు లేరు: సీఎం చంద్రబాబు

51చూసినవారు
జగన్ వల్లే నాకు అప్పు ఇచ్చే వాళ్లు లేరు: సీఎం చంద్రబాబు
విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటిస్తున్నారు. అక్కడ ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ విషయాన్ని ప్రజలూ గుర్తుపెట్టుకోవాలి. జగన్ రూ.10.50 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారు. నేను ఇప్పుడు అప్పు అడిగినా ఇచ్చే వాళ్లు లేరు. వరదతీవ్రత వల్ల నష్టపోయిన వారికి న్యాయం చేస్తాం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్