నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఒక్క రోజులో అత్యధిక లావాదేవీలు జరిపి ప్రపంచ రికార్డు సృష్టించింది. నిన్న ఎన్ఎస్ఇ 1,971 కోట్ల ఆర్డర్లను నిర్వహించగా, 28.55 కోట్ల లావాదేవీలను నమోదు చేసినట్లు ఎక్స్ఛేంజ్ సిఇఒ ఆశిష్ చౌహాన్ తెలిపారు. కాగా, తమ మద్దతు ఎన్డీయేకేనని టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ స్పష్టం చేయడంతో మార్కెట్లలో ఉత్సాహం నింపింది. దీంతో నిన్న నిఫ్టీ 735 పాయింట్ల లాభంతో ముగిసింది.