తెలంగాణ లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే మొదలైన పోలింగ్లో పలువురు సెలబ్రెటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్లోని ఓబుల్రెడ్డి స్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రంలో తన ఓటు వేశారు. భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఎన్టీఆర్ క్యూ లైన్లో కనిపించారు.