భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఖమ్మం డిపోకు చెందిన బస్సు రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. స్థానికుల సహాయంతో పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.