నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ శాసనసభల్లో తీర్మానాలు చేయాలంటూ పలు రాష్ట్రాల సీఎంలకు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలంటూ కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో శుక్రవారం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్ శాసనసభల్లోనూ తీర్మానం చేయాలని స్టాలిన్ కోరారు.