కొడనాడ్ హీస్ట్ కమ్ మర్డర్ ఘటనల సందర్భంగా విదేశాల నుంచి అనుమానితులకు కాల్స్ రావడంతో ఇంటర్పోల్ సహకారంతో కేసు దర్యాప్తు చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు. శనివారం జగిరిన అసెంబ్లీ సమావేశాల్లో స్టాలిన్, కొడనాడు కేసుకు సంబంధించి మాట్లాడారు. ఈ కేసులో ఇప్పటివరకు 268 సాక్షులను విచారించినట్లు తెలిపారు.