లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ప్రతిపక్షాల మధ్య మంగళవారం ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో మరోసారి ఆయన లోక్సభ స్పీకర్ పదవి చేపట్టనున్నారు. లోక్సభ స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్టకూడదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. ప్రధాని మోడీతో ఓంబిర్లా మంగళవారం భేటీ అయ్యారు. కాసేపటిలో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ సమర్పించే వీలుంది.