తెలంగాణ యువత ఉద్యోగాలు వస్తాయని రాష్ట్రం కోసం పోరాటం చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. 'పేదల ఉద్యోగాల గురించి కేసీఆర్ పదేళ్ల పాటు పట్టించుకోలేదు. కుమారుడు, కుమార్తె, అల్లుడు, బంధువులకు మాత్రమే కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం రాగానే ఎల్బీ స్టేడియంలో 25 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చాం.రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ, అమిత్ షా తలుచుకున్నారు' అని మండిపడ్డారు.