మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోని తడోబా టైగర్ రిజర్వ్లో జగిరిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అడవిలోని రోడ్డు పక్కన కల్వర్టు కింద ఓ ఎలుగుబంటి విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో ఓ పులి అక్కడికి వెళ్లి, ఎలుగుబంటిపై దాడి చేసి చంపేయాలని చూస్తుంది. పులి తనపైకి రావడం చూసి ఎలుగుబంటికి కోపం కట్టలు తెంచుకుంటుంది. పులికి ఎదురుగా వెళ్లి రెండు కాళ్లపై నిలబడి వింతగా ప్రవర్తిస్తుంది. దీంతో పులి భయపడి ఉడాయిస్తుంది.