దక్షిణ భారతదేశంలోని ఆలయాలను సందర్శిస్తానని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బుధవారం కేరళ తిరువళ్లంలోని పరశురామర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. పవన్కు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పరశురామర్ స్వామికి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.