ఎలిగేడు: మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

84చూసినవారు
ఎలిగేడు: మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు, మల్లికార్జున స్వామి దేవస్థానం మాజీ అధ్యక్షులు గుర్రం మల్లారెడ్డి గత రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. శనివారం ఈ విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి మల్లారెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అంకితభావం గల కార్యకర్తలను కోల్పోయిందని అన్నారు.

సంబంధిత పోస్ట్