పీహెచ్డీ అడ్మిషన్లకు యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించకుండా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్లు కల్పించాలని యూజీసీ నిర్ణయించింది. 2024-25 నుండి దీన్ని అమలుచేయాలని అన్ని యూనివర్సిటీలకు సూచించింది. 2024 జూన్ సెషన్కు సంబంధించి వచ్చే వారం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించేందుకు ఎన్టీఏ కసరత్తు చేస్తున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్కుమార్ ట్వీట్ చేశారు.