ప్రధాని నరేంద్ర మోదీ సిక్కులకు స్వయంగా భోజనం వడ్డించారు. బీహార్, పట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోదీ అక్కడ నిర్వహించిన లంగర్లో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు. అటు ఇవాళ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతున్నానని తెలిపారు.