మహారాష్ట్రలోని పుణెలో జరుగుతున్న ఓ వ్యభిచార రాకెట్ను స్థానిక పోలీసులు ఛేదించారు. హింజేవాడి ప్రాంతంలోని ఓ స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ స్పాపై దాడి చేసి ముగ్గురు మహిళలను కాపాడారు. అలాగే స్పా ఓనర్తో పాటు మరో ఇద్దరు మగాళ్లను అరెస్ట్ చేశారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.