ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్పై దాడి కేసులో దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీసులు.. ఆదివారం ఉదయం సీఎం కేజ్రీవాల్ నివాసంలోని సీసీ టీవీ డీవీఆర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సీసీ కెమెరాలోని ఫుటేజ్ కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కాగా బిభవ్ అరెస్ట్ను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండిచింది.