ఖరీదైన కారులో వచ్చిన ఓ మైనర్ ఇద్దరిని ఢీకొని వారి మృతికి కారణమయ్యాడు. పూణేలోని కళ్యాణి నగర్లో ఇవాళ తెల్లవారుజామున 3.15 గంటలకు జరిగిందీ ప్రమాదం. అనీష్ అవడియా, అశ్విని కోస్టా అనే ఇద్దరు క్లబ్లో పార్టీ చేసుకుని మోటార్సైకిళ్లపై ఇంటికి తిరిగి వస్తుండగా పోర్స్చే కారును వేదాంత్ అగర్వాల్ (17) అనే మైనర్ వేగంగా నడుపుకుంటూ వచ్చి వారిని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ మరణించారు. స్థానికులు మైనర్ను చితకబాది పోలీసులకు అప్పగించారు.