ఢిల్లీలో మండిపోతున్న ఎండలు.. రెడ్‌ అలర్ట్‌ జారీచేసిన ఐఎండీ

50చూసినవారు
ఢిల్లీలో మండిపోతున్న ఎండలు.. రెడ్‌ అలర్ట్‌ జారీచేసిన ఐఎండీ
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఢిల్లీకి వచ్చే పర్యాటకులు ఈ ఎండలకు అల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా ఎండల తీవ్రత మరింత పెరుగుతున్నది. సుమారుగా 28- 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో ఐఎండీ ఢిల్లీకి రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. మరో వారంపాటు ఢిల్లీలో ఎండలు ఇదేవిధంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్‌ శాస్త్రవేత్త నరేశ్‌ కుమార్‌ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్