సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా వేదింపులతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆస్పత్రికి వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పై నుండి ఆదేశాలు ఉన్నాయంటూ మార్చురీ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.