48 గంటల్లో ఇండియా కూటమి ప్రధానిని ఎన్నుకుంటాం: జైరాం రమేశ్

80చూసినవారు
48 గంటల్లో ఇండియా కూటమి ప్రధానిని ఎన్నుకుంటాం: జైరాం రమేశ్
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరన్న దానిపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. మరో 48 గంటల్లో ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. మెజారిటీకి అవసరమైన 272 సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఇండియా కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. స్పష్టమైన మెజారిటీ వస్తుంది కాబట్టి ప్రధాని ఎంపికపై నిర్ణయం తీసుకోవడానికి 48 గంటల కంటే తక్కువ సమయం పట్టొచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్