నేడు తొలి దశ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 18 లక్షల మంది ఎన్నికల సిబందిని వినియోగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తొలి దశలో అత్యధిక స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. దేశంలో అనేక చోట్ల పారా మిలటరీ బలగాలు పహారాకాస్తున్నాయి. మావోల ప్రాబల్యం ఉన్న బస్తర్ ప్రాంతంలోనూ నేడు పోలింగ్ జరగనుండటంతో బలగాలు మొహరించాయి.