అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డాడు. పిట్స్బర్గ్లో మాట్లాడుతూ.. రెండో ప్రపంచయుద్దంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు తలెత్తుతున్నాయి. 1944లో న్యూగినియా ఉత్తరతీరంలో ఆంబ్రోస్ ప్రయాణిస్తున్న విమానం కూలింది. ఆ ఘటనలో ఆంబ్రోస్తో పాటు మరో ఇద్దరు చనిపోయారు. మృతదేహాలు లభ్యంకాలేదు. దీనిపై బైడెన్ ‘న్యూగినియాలో అప్పట్లో నరమాంస భక్షకులు ఉండేవాళ్లు’ అని అన్నారు.