ప్రధానిపై పోస్టు.. జర్నలిస్టుకు జరిమానా

63చూసినవారు
ప్రధానిపై పోస్టు.. జర్నలిస్టుకు జరిమానా
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పరువుకు భంగం కలిగించినందుకు ఓ జర్నలిస్టు చిక్కుల్లో పడ్డారు. నష్టపరిహారం కింద ప్రధానికి 5వేల యూరోలు చెల్లించాలంటూ మిలాన్ న్యాయస్థానం ఆదేశించింది. ‘‘మెలోనీ మీరు నన్ను భయపెట్టలేరు. మీ ఎత్తు కేవలం 1.2 మీటర్లు మాత్రమే. మీరు అసలు నాకు కనిపించరు’’ అని వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. దీనిపై మెలోనీ కేసు పెట్టారు. కేసును విచారించిన మిలాన్‌ కోర్టు తాజాగా సదరు జర్నలిస్టుకు 5వేల యూరోల జరిమానా విధించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్