ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటించిన 'సలార్ పార్ట్ 1 – సీజ్ఫైర్' సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో ప్రభాస్ వాడిన ఐకానిక్ బైక్ గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్ శుక్రవారం ట్వీట్ చేసింది. స్టార్ సువర్ణ ఛానల్ (కన్నడ)లో 28 ఏప్రిల్ 2024న రాత్రి 7 గంటలకు సలార్ ప్రసారం కానుంది. ఆ సమయంలో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానమిచ్చిన వారు ఈ బైక్ను గెలుచుకునే అవకాశం ఉంది.