మే 31న భారత్‌కు ప్రజ్వల్?

55చూసినవారు
మే 31న భారత్‌కు ప్రజ్వల్?
కర్ణాటక సెక్స్ స్కాండల్‌ కేసులో ప్రధాన నిందితుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈ నెల 31న భారత్‌ రానున్నట్టు తెలుస్తోంది. జర్మనీలోని మ్యూనిచ్ నుంచి బెంగళూరుకు విమానంలో బుక్ చేసుకున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ కేసుపై విచారణ జరుపుతున్న సిట్ బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో నిఘా ఉంచింది. కాగా ప్రజ్వల్ గతంలో రెండుసార్లు జర్మనీ నుంచి తన విమాన టిక్కెట్‌ను రద్దు చేసుకున్నారు. మరి ఈసారైనా వస్తారో లేదో చూడాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్