సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ స్టార్ ప్లేయర్ HS ప్రణయ్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్లో 5వ సీడ్గా బరిలోకి దిగిన అతడు బుధవారం జరిగిన తొలి రౌండ్లో బ్రెజిల్ ఆటగాడు యోగోర్ కోయెల్హోను మట్టికరిపించాడు. 47 నిమిషాలపాటు సాగిన మ్యాచ్లో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన ప్రణయ్ 21-10, 23-21 తేడాతో వరుసగా గేమ్లో విజయం సాధించాడు.