రాణించిన ప్రణవి.. బెంగాల్‌పై హైదరాబాద్ విజయం

59చూసినవారు
రాణించిన ప్రణవి.. బెంగాల్‌పై హైదరాబాద్ విజయం
బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 24 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత హైదరాబాద్ 50 ఓవర్లలో 225/9 స్కోర్ సాధించింది. కాగా, ప్రణవి చంద్ర(88 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధ సెంచరీతో బాధ్యయుత ఇన్నింగ్స్ ఆడింది. ఈ గెలుపుతో హైదరాబాద్‌కు 4 పాయింట్లు లభించాయి.

సంబంధిత పోస్ట్