ఫోన్ ట్యాపింగ్ తో భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన గత కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. దారుణమైన స్థితికి దిగజారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినవారిని ఉపేక్షించవద్దన్నారు. మద్యం కేసు నుంచి తన బిడ్డను కాపాడుకునేందుకు బీజేపీ అగ్రనేతల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి పట్ల రేవంత్ సర్కార్ ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు.