ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ 'మన్ కీ బాత్'లో మాట్లాడారు. వంటనూనె వినియోగాన్ని కనీసం 10 శాతం మేర తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు 10 మంది ప్రముఖులను తాను నామినేట్ చేస్తున్నానని తాజాగా తెలిపారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తదితర ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ ‘X’లో పోస్టు పెట్టారు.