పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పంజాబ్ బ్యాటర్స్ లలో అశుతోష్ శర్మ(28 బంతుల్లో 61 రన్స్), శశాంక్ సింగ్(25 బంతుల్లో 41) మాత్రమే గౌరవప్రదమైన స్కోరు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.