ఒడిశా కేంద్రపరాలోని ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఓ వృద్దురాలికి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటోను బీజేపీ ట్వీట్ చేస్తూ.. ‘నేను మీ సేవకుడ్ని, మీ కుమారుడిని’ అని పోస్ట్ చేసింది. దేశంలో మూడోసారి మోదీ సర్కార్ను తీసుకువచ్చేందుకు ప్రజలంతా నిర్ణయించారని పేర్కొంది.