14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోదీ

70చూసినవారు
14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోదీ
2019లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు 18న తొలి విడత, 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక, మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అక్టోబరు 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్