కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్

84చూసినవారు
కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్
ప్రియాంక గాంధీ తన ఎక్స్ ఖాతాలో.. “మొదట నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని, ఇప్పుడు దాని ఫలితాల్లోనూ స్కామ్ ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒకే సెంటర్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు 720కి 720 మార్కులు తెచ్చుకోవడంతో అనేక రకాల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ పరీక్ష ఫలితాల్లో రిగ్గింగ్‌కు సంబంధించిన చట్టబద్ధమైన ప్రశ్నలకు విద్యార్థులకు సమాధానాలు అవసరం. న్యాయబద్ధమైన ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?” అని రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్