నిందితుల లిస్టులో ఆమ్ ఆద్మీ పార్టీ

55చూసినవారు
నిందితుల లిస్టులో ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా మారుస్తామని ఈడీ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఆప్‌ను నిందితుడిగా చేర్చనున్నట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా వేసిన పిటిషన్‌ను కోర్టు పరిశీలిస్తున్న సమయంలో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఓ పార్టీని నిందితుల జాబితాలో చేర్చడం చరిత్రలోనే ఇది మొదటిసారి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్