అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్, బస్సు ఢీకొనడంతో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.