ఈ నెల 10న తణుకులో నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. తాడేపల్లిగూడెం జెండా సభ అనంతరం ఇద్దరు నాయకులు కలిసి పాల్గొనే సభ కావడంతో ఇరు పార్టీల కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరానున్నారు. దీంతో నాయకులు సభా ఏర్పాట్లపై కసరత్తు మొదలు పెట్టారు.