పార్టీలకతీతంగా ప్రజా తీర్పును గౌరవించాలని జనసేన పీఏసీ ఛైర్మన్, తెనాలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి(జనసేన) నాదెండ్ల మనోహర్ అన్నారు. కౌంటింగ్ రోజున వైసీపీ నేతలు తెనాలిలో ఘర్షణలు సృష్టించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కూటమి నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఘర్షణలకు దూరంగా ఉందామని, ప్రజా తీర్పును గౌరవిద్దామని నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.