చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ బ్యాటర్ శశాంక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 52 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. శశాంక్కు తోడుగా జాన్ సేన్ (34*) కూడా ధాటిగా ఆడడంతో పంజాబ్ 219 పరుగుల భారీ స్కోరు చేసింది.