రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు తారుమారు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఏపీలో ఎన్టీఆర్ జిల్లాలో ఇన్విజిలెటర్ల తప్పిదం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పదోతరగతి పరీక్షల్లో భాగంగా శనివారం మొదటి భాష పేపర్-2, ఓఎస్ఎస్సీ ప్రధాన భాష పరీక్షలలలో ఆరుగురు విద్యార్థులకు తారుమారుగా ఇచ్చారు. దీంతో, పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు అన్యాయం జరగకుండా మూల్యాంకనం చేసినప్పుడు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.