సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈవాళ(సోమవారం) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను ఈవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఈ నెల 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.