తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటలు

55చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 81,465 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 6 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. 31,251 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు సమకూరింది.

సంబంధిత పోస్ట్