మెదక్ ఖిల్లాపై కాషాయ జెండా ఎగిరింది. కాంగ్రెస్ అభ్యర్థిపై 33 వేల మెజారిటీతో మెదక్ ఎంపీగా BJP అభ్యర్తి రఘునందన్రావు గెలుపొందారు. ఈ స్థానంలో చివరిసారిగా 1999లో బీజేపీ మెదక్ ఎంపీ సీటు గెలిచింది. 25 ఏళ్ల తరువాత మెదక్ సీటును బీజేపీ గెలిచింది. BRS ఈ స్థానమైన గెలుస్తుందని ఆశించినా.. చివరికి రఘునందన్ గెలవడంతో బీఆర్ఎస్ ఏ ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు.