*ఆదిలాబాద్ లోక్సభ సీటు నుంచి భాజపా అభ్యర్థి గోడం నగేష్ విజయం సాధించారు. 78వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
*నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం సాధించారు. 5.51లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించడం విశేషం.
*ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయం సాధించారు. ఆయనకు 4.56లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.
*వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2.02లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.
*మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3.24లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
*జహీరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 45వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.
*భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్కుమార్ రెడ్డి 1.95లక్షలకు పైగా మెజార్టీతో విజయఢంకా మోగించారు.
*నాగర్కర్నూలులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి 85వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.
*నిజామాబాద్లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 1.13లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.
*కరీంనగర్ లోక్సభ సీటు నుంచి భాజపా నేత బండి సంజయ్ 2.12లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.
*పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.