BRS అభ్యర్థిపై రఘునందన్ రావు ఫిర్యాదు

56చూసినవారు
BRS అభ్యర్థిపై రఘునందన్ రావు ఫిర్యాదు
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు శుక్రవారం కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్‌క్వాలిఫై చేయాలని సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ఓటర్‌కు వెంకట్రామిరెడ్డి రూ.500 పంపిణీ చేశారని ఆరోపించారు. తనకు ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్