నల్గొండ పార్లమెంట్
కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి తనయుడు పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. నల్గొండ పార్లమెంటు టికెట్ కోసం 9 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రధానంగా టికెట్ కోసం రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. పటేల్ రమేష్ రెడ్డికి కార్పొరేషన్ లేదా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని రేవంత్ రెడ్డి, జానారెడ్డి హామీ ఇచ్చి నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది.