కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ విమర్శలు గుప్పించారు. ఇవాళ లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగించిన తీరు మాంచి స్టాండప్ కమెడియన్ను తలపించిందని ఎద్దేవాచేశారు. ఆయన దేవుళ్ల, దేవతలను కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చేశారని వ్యాఖ్యానించారు. ఆఖరికి పరమశివుడి అభయహస్తాన్నీ కాంగ్రెస్ పార్టీ హస్తమే అని చెప్పడం హాస్యాస్పదంగా అనిపించిందని విమర్శించారు.