రాజస్థాన్తో మ్యాచ్లో టాస్ నెగ్గిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ ఆదిలోనే తొలి వికెట్ను కోల్పోయింది. దిల్లీ బౌలర్ ముకేశ్ కుమార్ వేసిన రెండో ఓవర్లో జైస్వాల్ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో క్రీజ్లోకి సంజు శాంసన్ వచ్చాడు. రెండు ఓవర్లకు రాజస్థాన్ స్కోర్ 9/1గా ఉంది.