భారత్లో నిరుద్యోగ పరిస్థితి దారుణంగా ఉందన్న ఐక్యరాజ్యసమితి నివేదికను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. భారతీయ కంపెనీల సర్వేల్లో భిన్నమైన గణాంకాలు ఉన్నాయని తెలిపారు. 6.4 కోట్ల మంది ఈపీఎఫ్ఓలో నమోదై ఉన్నారు. ఇది ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ జనాభా కంటే ఎక్కువ. 34 కోట్ల ముద్రా రుణాలు మంజూరయ్యాయని, వీటితో ఎంతో మందిని తీర్చిదిద్దామన్నారు. విదేశీ రేటింగ్ ఏజెన్సీలపై ఆధారపడడం మానుకోవాలన్నారు.