ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ కార్ల ధరలను పెంచనుంది. ఎంపిక చేసిన మోడళ్లపై 1 శాతం వరకు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి సరకుల ధరలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దేశీయంగా టయోటా కంపెనీ గ్లాంజా వంటి హ్యాచ్బ్యాక్ల మొదలు ఫార్చూనర్ వంటి SUV ల వరకు వివిధ రకాల మోడళ్లను విక్రయిస్తోంది.