లాయర్ల లేఖపై స్పందించిన ప్రధాని మోదీ

571చూసినవారు
లాయర్ల లేఖపై స్పందించిన ప్రధాని మోదీ
దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ 600 మందికి పైగా లాయర్లు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు. ‘కాంగ్రెస్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను కోరుకుంటుంది. కానీ.. దేశంపై మాత్రం ఎటువంటి నిబద్ధతను చాటుకోదు’ అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్